తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 7, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,135 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే మరో ఇద్దరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1561 కి పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 397 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,82,574 కు చేరుకుంది. ప్రస్తుతం 5,000 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 72 లక్షలకు చేరువైంది. గురువారం నాడు 38,985 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 71,84,598 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,93,030 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ