దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. “3 రోజులు నుంచి తేలికపాటి జ్వరం ఉన్నందున కరోనా పరీక్ష చేయించుకున్నాను. హిమాలయాలకు వెళ్ళినపుడు భౌతిక దూరంతో పాటుగా కోవిడ్ యొక్క అన్ని నిబంధనలను అనుసరించాను, అయినప్పటికీ కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం హరిద్వార్ మరియు రిషికేశ్ మధ్య ఉన్న వందే మాతరం కుంజ్ వద్ద క్వారంటైన్ లో ఉన్నాను. 4 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయించుకుంటున్నాను. పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యుల సూచన మేరకు నడుచుకుంటాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అని ఉమా భారతి ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu