రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65 లక్షల ఎకరాలకు గాను రూ.6632.74 కోట్లు నగదును అందించామని తెలిపారు. పదెకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి నేరుగా నిధులు జమచేశామని అన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,31,660 మంది రైతుల ఖాతాలలోకి రూ.530.07 కోట్లు, కనిష్టంగా మేడ్చల్ జిల్లాలో 29,685 మంది రైతుల ఖాతాలలోకి రూ.26.82 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష:
నల్గొండ తరువాత స్థానాలలో అత్యధిక లబ్దిదారులు ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో ఉన్నారని మంత్రి తెలిపారు. మేడ్చల్, ములుగు, వరంగల్ అర్బన్ జిల్లాలలో లక్ష లోపు లబ్దిదారులు ఉన్నారన్నారు. రైతులు తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో నల్గొండ తర్వాత ఎక్కువ నిధులు నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్లాయన్నారు. ఆ జిల్లాలో 2,52,958 మంది రైతుల ఖాతాలలో రూ.327.13 కోట్లు జమచేసినట్లు చెప్పారు. అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని, అందుకే కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు రోజులలో మిగిలిన రైతుల ఖాతాల్లోకి కూడా రైతుబంధు నిధులు జమచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ