దేశంలో ఫిబ్రవరి 22, సాయంత్రం 6 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 14 లక్షలు (1,14,24,094) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.. ఇందులో 64,25,060 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 11,15,542 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 38,83,492 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్) వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. కాగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, లక్షద్వీప్ వంటి 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లలో 75% కంటే ఎక్కువమందికి మొదటి డోస్ వ్యాక్సిన్ అందజేసినట్టు తెలిపారు. అలాగే సోమవారం నాడు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 50201, కర్ణాటకలో 30586, పశ్చిమబెంగాల్ లో 23580, మహారాష్ట్రలో 22979, బీహార్ లో 19501 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ