మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. సోమవారం నాడు మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఛగన్ భుజ్బల్ కు కరోనా సోకినట్టు తెలిపారు. ఈ నెలలో ఇప్పటికే జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, అనిల్ దేశ్ముఖ్, బచ్చు కాడు, రాజేంద్ర షింగ్రే, సతేజ్పాటిల్ వంటి మంత్రులు కరోనా బారినపడ్డారు, దీంతో నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు మంత్రులకు కరోనా సోకినట్టు అయింది.
పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు. కరోనా కేసుల పెరుగుదల ఇలానే ఉంటే మరో లాక్డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ వంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల పాటుగా లాక్డౌన్ ఆంక్షలు విధించారు. మరోవైపు ఫిబ్రవరి 20, ఆదివారం నాటికీ మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,00,884 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,788 కి పెరిగింది. ప్రస్తుతం 52,956 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ