సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్కెఆర్ భవన్ లో జీఏడీ మరియు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. పదవీ విరమణ పొందిన అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారుల పనితీరును, వారు అందించిన సేవలను కొనియాడారు. ఆ అధికారులు సంతోషంగా, శేష జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వారిని గౌరవప్రదంగా ప్రభుత్వ వాహనంలో వారి ఇంటికి సాగనంపాలని అధికారులను ఆదేశించారు. ఇకముందు జరగబోయే పదవీ విరమణ సన్మాన సభలను ఘనంగా, సమన్వయంతో నిర్వహించాలని కోరారు.
సచివాలయంలో ఆయా విభాగాలలో పని చేస్తున్న ఐఅండ్ సీఏడి శాఖ సహాయ కార్యదర్శి ఓ.శ్రీదేవి, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖ సెక్షన్ ఆఫీసర్ బి.ఎన్.ఎస్.వి. ప్రసాద్, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి కార్యాలయంలో పనిచేస్తున్న పర్సనల్ సెక్రటరీ కె.ఉమారాణి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గ్రేడ్-2 సెక్షన్ అసిస్టెంట్ ఆర్. కిషన్ లాల్ లు శనివారం నాడు పదవీ విరమణ పొందినవారిలో ఉన్నారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జిఏడి ముఖ్యకార్యదర్శి, వికాస్ రాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, ప్రొటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అర్విందర్ సింగ్, అడిషనల్ సెక్రటరీ నరేందర్ రావు మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ