మార్చి 26, శుక్రవారం నాడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు భారత్ బంద్ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు, కార్మికులు తలపెట్టిన భారత్ బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా ఏపీ రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారత్ బంద్ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, అలాగే రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని చెప్పారు. బంద్ లో అన్నివర్గాల వారు శాంతియుత పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు.
వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా రైతులు, కార్మికులు చేపడుతున్న భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. బంద్ లో పాల్గొని రైతులు, కార్మికులు మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా పలు వ్యాపార, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వాహనా యాజమానుల సంఘాలు, ఇతర వర్గాలు మద్దతు ప్రకటించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ