రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తునట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విద్యాసంస్థలు మూసివేత నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి విద్యార్థుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీలు స్పష్టత ఇచ్చాయి. తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు యథాతథంగా జరుగునున్నాయి. కరోనా ప్రోటోకాల్ కు అనుగుణంగా పరీక్షల నిర్వహణ ఉంటుందని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఈ మేరకు ఆయా వర్సిటీలు ప్రకటన విడుదల చేశాయి.
ఈ యూనివర్సిటీల పరిధిలో పలు పీజీ కోర్సుల పరీక్షలు, ఇంజినీరింగ్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. అలాగే జేఎన్టీయూ పరిధిలో కరోనా వలన పరీక్షలు రాయలేని విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని, ఆ ప్రత్యేక పరీక్షను రెగ్యులర్గానే పరిగణిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ తెలిపారు. కాగా విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా పడినట్టుగా అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ