దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ”నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. దయచేసి అందరు కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను” అని సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కరోనా వైరస్ బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ