ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు ఉదయం వెల్లడించారు. రెపో రేటు, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు లేవని, యథాతథంగా కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతమున్న 4 శాతం రెపో రేటు, 3.35 శాతం రివర్స్ రెపో రేటు అలాగే అమలు కానున్నట్లు తెలిపారు. కీలక పాలసీ రేట్లపై యథాతథస్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఐదవసారి అని చెప్పారు.
ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అలాగే మార్కెట్లో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తాజా రుణాల కోసం నాబార్డ్, ఎన్హెచ్బి మరియు సిడ్బిలకు రూ.50,000 కోట్ల అదనపు లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ