దేశంలోని ప్రధాన నగరాలలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వెలుగు చూడటం దేశవ్యాప్తంగా టెన్షన్ కి గురి చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే ఒమిక్రాన్ ప్రభావం దేశం మొత్తం మీద పడే అవకాశం ఉన్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది (IMA). అలాగే, కరోనా వాక్సిన్ బూస్టర్ డోసులపై కూడా వేగంగా నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులకు 3వ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23 కి చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒమిక్రాన్ వేరియెంట్ లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని, అందువలన ఇది తక్కువ సమయంలో ఎక్కువమందిని ప్రభావితం చేయగలదని IMA వెల్లడించింది. డెల్టా వేరియెంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియెంట్ 5 నుంచి 10 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది. దీనిపై సరైన జాగ్రత్త వహించకపోతే ఒమిక్రాన్ దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాబట్టి, ప్రభుత్వం సకాలంలో అందరికీ వాక్సిన్ అందచేయాలని సూచించారు. రెండవ డోస్ వేసుకోని వారిపై దృష్టి పెట్టాలని చెప్పారు. విదేశీ ప్రయాణాలపై భారత ప్రభుత్వం కొన్నిరోజుల పాటు ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై కూడా ఆలోచన చేయాలని IMA సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ