ప్రముఖ వైద్యులు, నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో కాకర్ల సుబ్బారావు జన్మించారు. రేడియాలజి విభాగంలో ఎన్నో సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు గడించారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పోరేటు ఆసుపత్రులకు దీటుగా అన్ని విభాగాలను అభివృద్ధి చేసి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వైద్యశాఖకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. కాకర్ల సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నిమ్స్ మాజీ డైరక్టర్ ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డా.కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ