ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 60,124 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2352, విశాఖపట్నంలో 1618, గుంటూరులో 1575, చిత్తూరులో 1543, నెల్లూరులో 1432 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,02,589 కు చేరుకుంది.
ఇక కరోనా వలన పశ్చిమగోదావరిలో పన్నెండు మంది, గుంటూరులో పన్నెండు మంది, తూర్పుగోదావరిలో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8791 కి పెరిగింది. గత 24 గంటల్లో 16167 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 11,04,431 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ