ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. “కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గడంలేదని, సరైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ