కోవిడ్ కేర్ సెంటర్ కు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రూ.2 కోట్ల విరాళం

Amitabh Bachchan Donated Rs 2 Crore to Sri Guru Tegh Bahadur Covid Care Centre at Delhi,Mango News,Mango News Telugu,Amitabh Bachchan Covid Care Donation,Amitabh Bachchan,Actor Amitabh Bachchan,Amitabh Bachchan Latest News,Amitabh Bachchan Latest,Amitabh Bachchan News,Amitabh Bachchan Donates Rs 2 Crore To Covid-19,Amitabh Bachchan Donates Rs 2 Crore To Covid-19 Care,Amitabh Bachchan Donates Rs 2 Crore,Amitabh Bachchan Donates 2 Crore To A Delhi Covid Care,Amitabh Bachchan Donation,Amitabh Bachchan Rs 2 Crore Donation,Sri Guru Tegh Bahadur Covid Care Centre,Covid Care Centre at Delhi,Delhi

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ సెంటర్ కు అమితాబ్ బచ్చన్ రూ.2 కోట్లు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ పురోగతి గురించి అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నారని, 2 కోట్లు విరాళం ఇవ్వడమే కాకుండా విదేశాల నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమయానికి తెప్పించేందుకు కూడా అమితాబ్ బచ్చన్ కృషి చేశారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్ హీరో అని కొనియాడారు. మరోవైపు 300 పడకలతో కూడిన ఈ కోవిడ్ కేర్ సెంటర్ సోమవారం నాడు ప్రారంభమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =