దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ సెంటర్ కు అమితాబ్ బచ్చన్ రూ.2 కోట్లు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ పురోగతి గురించి అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారని, 2 కోట్లు విరాళం ఇవ్వడమే కాకుండా విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమయానికి తెప్పించేందుకు కూడా అమితాబ్ బచ్చన్ కృషి చేశారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్ హీరో అని కొనియాడారు. మరోవైపు 300 పడకలతో కూడిన ఈ కోవిడ్ కేర్ సెంటర్ సోమవారం నాడు ప్రారంభమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ