రాష్ట్రంలో విధుల నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారినపడుతున్న వైద్యులుకు చికిత్స అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికీ హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ చికిత్సకై వైద్యులను చేర్చుకునేందుకు ఆర్ఎంను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా బారినపడుతున్న వైద్యులకు నిమ్స్ లో ఉచిత చికిత్స అందజేయాలనే డిమాండ్ ను ఇటీవలే సమ్మె సందర్భంగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో నిమ్స్ లో చికిత్స అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ