మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 2, సోమవారం నాడు 4,869 కరోనా కేసులు, 90 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,15,063 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,33,038 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 8,429 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 61,03,325 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.65 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 75,303 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 15473 యాక్టీవ్ కేసులు ఉండగా, సంగ్లీలో 7744 సతారాలో 7416, థానేలో 6068, అహ్మెద్ నగర్ లో 5857, కొల్హాపూర్ లో 5580, ముంబయిలో 5276 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 4,83,52,467 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ