ప్రముఖ నటి రేణు దేశాయ్ మరియు కొడుకు అకీరా నందన్ ఇరువురూ కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం తమకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని.. టెస్ట్ చేయించుకోగా ఇద్దరికీ రిజల్ట్ పాజిటివ్ వచ్చినదని రేణు తెలియజేసారు. అయితే, ప్రస్తుతం తాము కోలుకుంటున్నామని.. త్వరలోనే సాధారణ జీవితం లోకి అడుగుపెడతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్.
View this post on Instagram
గతేడాది, తాను 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. అలాగే, కొడుకు అకీరా నందన్ కి కూడా వ్యాక్సిన్ వేయించే ఆలోచనలో ఉండగానే.. ఈలోపు తమకు కోవిడ్-19 సోకిందని తెలియజేశారు. గత కొద్దిరోజులుగా తమను కలిసిన వారందరినీ టెస్టులు చేయించుకోవాలని కోరామని చెప్పారు. ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని రేణు కోరారు. మనదేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో.. అందరూ అప్రమత్తంగా ఉండాలని, దీనిని ఎవరూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ