ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఓ సీనియర్ అధికారి వైదొలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారు అమర్జీత్ సిన్హా సోమవారం రాజీనామా చేసినట్టు సమాచారం. అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్ బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. అమర్జీత్ సిన్హా ముందుగా 2019 లో రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం ఫిబ్రవరి, 2020లో రెండేళ్ల కాలానికి ప్రధాని మోదీ సలహాదారుగా నియమించబడ్డారు. పీఎంఓలో అన్ని సామాజిక రంగ పథకాలు మరియు విధానాలను అమర్జీత్ సిన్హా నిర్వహించేవారు. అయితే పదవీకాలం ఇంకా పూర్తికాకముందే సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకోడానికి గల కారణాలను ఆయన పేర్కొనలేదని తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ