కేంద్ర హోమ్ శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో మంగళవారం నాడు భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని అమిత్ షా ఛాంబర్లో ఈ భేటీ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ సహా పలువురు రాష్ట్ర నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ధాన్యం కొనుగోళ్లు సహా పలు అంశాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వాదనను తిప్పికొట్టడంపై పార్టీ నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు వరుసగా పలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్ షాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ