ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్చార్జి చైర్మన్ గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ఉన్న పిన్నమనేని ఉదయభాస్కర్ ఇటీవలే పదవీవిరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఏపీపీఎస్సీలో సభ్యుడిగా కొనసాగుతున్న ఏవీ రమణారెడ్డికి ఇన్చార్జి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారమే ఏవీ రమణారెడ్డి ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇన్చార్జి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ