రాజ్యసభలో తీవ్ర భావోద్వేగానికి గురైన చైర్మన్ వెంకయ్యనాయుడు

Chairman Venkaiah Naidu, m venkaiah naidu, Mango News, Rajya Sabha Chairman Venkaiah Naidu, Rajya Sabha Chairman Venkaiah Naidu Breaks Down, Rajya Sabha Chairman Venkaiah Naidu Breaks Down over Opposition Ruckus, RS Chairman Venkaiah Naidu breaks down, Venkaiah Naidu breaks down over oppn ruckus, Venkaiah Naidu Breaks Down over Opposition Ruckus, Venkaiah Naidu breaks down over ruckus in Rajya Sabha, Venkaiah Naidu hits out at Opposition ruckus in Parliament

రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు బుధవారం నాడు సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనపై మాట్లాడుతూ వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు. సభ యొక్క యొక్క పవిత్రతను కొందరు ప్రతిపక్ష ఎంపీలు ధ్వంసం చేశారన్నారు. ఈ పరిణామాలు తలుచుకుంటే గత రాత్రి తనకు నిద్రపట్టలేదని, సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని చెప్పారు.

ప్రజాస్వామ్యానికి పార్లమెంట్‌ పవిత్రమైన దేవాలయం లాంటిదని అన్నారు. నిన్న రాజ్యసభలో కొందరు ఈ పవిత్రతను నాశనం చేసిన విధానంతో చాలా బాధపడ్డానని వెంకయ్య నాయుడు అన్నారు. కొంతమంది సభ్యులు టేబుల్‌పై కూర్చుంటే, మరికొందరు హౌస్ టేబుల్‌ పైకి ఎక్కారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం చాలా బాధించింది. ఈ ఘటనపై వేదనను తెలియజేయడానికి, ఈ చర్యలను ఖండించడానికి తన దగ్గర ఎలాంటి పదాలు లేవని అన్నారు. ప్రసంగం అనంతరం రాజ్యసభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తూ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు లోక్ సభ నిరవధికంగా వాయిదా వేయబడింది. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, ముందుగానే ఆగస్టు 11నే లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =