76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఎర్రకోట వద్దకు చేరుకునే ముందు ప్రధాని మోదీ ముందుగా రాజ్ ఘాట్ ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆతరువాత ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో వరుసగా తొమ్మిదోసారి మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారతదేశాన్ని ప్రేమించే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు కొత్త సంకల్పంతో కొత్త దిశలో అడుగులు వేయాల్సిన రోజు అని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం కోసం పోరాడిన ఎందరో వీరులను, నాయకులను మనం స్మరించుకున్నామన్నారు. అదేవిధంగా గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు అని చెప్పారు. ఎర్రకోటలో జరిగిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులు, భారత సైన్యం, నేవీ, వైమానిక దళం అధికారులు, ఎన్సీసీ క్యాడెట్స్, పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY