కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 55,631 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 2,514 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.51 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్ 23, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 52,28,286 కి చేరింది.
అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 54 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 45,861 కు పెరిగింది. ఇక కొత్తగా 3,427 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 51,55,142,కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 26,605 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,10,65,473 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ