ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ములాయం కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయితే, కొన్నేళ్లుగా అపర్ణాతో టచ్లో ఉన్న బీజేపీ.. అపర్ణాను పార్టీలో చేర్చుకొని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్వాదీ పార్టీకి బీజేపీ రివర్స్ పంచ్ ఇచ్చింది.
అపర్ణా యాదవ్.. ములాయంసింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున లక్నో నుంచి పోటీచేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అపర్ణా యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ సామాజిక వర్గమైన ఠాకూర్ బిష్ట్ వర్గానికి చెందినవారు. తొలి నుంచి ప్రధాని మోదీ విధానాలపై సానుకూల వైఖరి ప్రదర్శించేవారు. ఎస్పీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కూడా అపర్ణా యాదవ్ బీజేపీలో చేరటానికి కారణమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF