దేశ రాజధాని ఢిల్లీలో గల ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) నూతన వైస్-ఛాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. జేఎన్యూ వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జేఎన్యూ చరిత్రలో తొలి మహిళా వైస్-ఛాన్సలర్ గా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె జేఎన్యూ పూర్వ విద్యార్థి కూడా కావడం విశేషం. అక్కడ ఎంఫిల్తో పాటుగా, అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్డి కూడా అభ్యసించారు. జేఎన్యూ వీసీ పదవీలో ఆమె ఐదేళ్ల పాటుగా కొనసాగనున్నారు.
శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జేఎన్యూ వీసీగా ఉన్న మామిడాల జగదీష్ కుమార్ ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు నూతన ఛైర్మన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టనున్న శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ కు మామిడాల జగదీష్ కుమార్ అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ