ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF