ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఈరోజు (గురువారం) ప్రభుత్వం నియమించిన సినిమా టికెట్ల కమిటీ సమావేశమైంది. కాగా, దీనికి సంబంధించి ఇదే చివరి సమావేశం కావొచ్చని భావిస్తున్నారు. అయితే, టికెట్ ధరల ప్రతిపాదనలను కమిటీ ఆల్రెడీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టికెట్ల ధరలపై నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ రిపోర్ట్ అధ్యయనం తరువాత టిక్కెట్ ధరలపై జగన్ సర్కార్ జీవో రూపంలో నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరో వారం రోజుల్లోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడుతుందని సినీ పరిశ్రమ ఆశిస్తోంది.
ఇప్పటికే సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. టికెట్ ధరలు, సినీ పరిశ్రమ సమస్యలపై ఇప్పటికే సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సీఎం జగన్ ని కలిశారు. వారందరి డిమాండ్స్, సూచనలపై కూడా నేటి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కమిటీ సమావేశమైంది. అతి త్వరలోనే ఇరు పక్షాలకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకోనున్నారని కమిటీ సభ్యులు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ