భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29న రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముగింపు వేడుకలను దృష్టిలో ఉంచుకుని సాధారణ సమయం కంటే 30 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ను ప్రారంభించేందుకు బీసీసీఐ అంగీకరించింది.
కోవిడ్ కారణంగా, 2019 తర్వాత ఐపీఎల్ ముగింపు వేడుకను నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో.. భారీగా నిర్వహించటానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులను ఈ ముగింపు వేడుకకు ఆహ్వనించారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై 50 నిమిషాల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. అనంతరం రాత్రి 7:30 గంటలకు టాస్ వేయనుండగా, 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు రణవీర్ సింగ్ మరియు ఏఆర్ రెహమాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా ప్లేఆఫ్లు మే 24 నుండి ప్రారంభమవుతాయి. తొలి క్వాలిఫయర్తో పాటు ఎలిమినేటర్కు కోల్కతా ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందని ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ