వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మే 25న వివిధ కేటగిరీల వాహనాలకు థర్డ్-పార్టీ మోటారు బీమా ప్రీమియంను జూన్ 1 నుండి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బైకులు, కార్ల బీమా ధరలు పెరగనున్నాయి. కాగా విద్యాసంస్థలకు చెందిన బస్సుల ప్రీమియంపై 15% డిస్కౌంట్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియంపై 7.5% డిస్కౌంట్ ప్రకటించారు. సవరించబడిన రేట్ల ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి.
ద్విచక్ర వాహనాలు
- 150 cc – 350 cc సామర్ధ్యం కలిగిన ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం- రూ. 1,366
- 350 cc కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన బైకుల ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 2,804
ప్రైవేట్ కార్లు
- 1,000 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 2,094
- 1,000 cc నుంచి 1,500 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 3,416
- 1,500 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 7,890
ఎలక్ట్రిక్ కార్లు
- 30 కిలోవాట్ల కంటే తక్కువ సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 1,780
- 30-65 కిలోవాట్ల మధ్య సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 2,904
కమర్షియల్ వాహనాలు
- 12,000 -20,000 కేజీల సామర్ధ్యం కలిగిన కమర్షియల్ వాహనాల ప్రీమియం – రూ. 35,313
- 40,000 కేజీల కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం – రూ. 44,242
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ