గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసింది. గురువారం నాడు బెంగళూరు పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ను స్థానిక లీలా ప్యాలెస్లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్రావు నేతృత్వంలో సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్లు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎం కేసీఆర్కు వివరించారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్ సీఎంకు వివరించారు. బీసీ కమిషన్ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు, ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో అధ్యయానాన్ని కొనసాగించాలని బీసీ కమిషన్ బృందానికి సీఎం కేసీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF