తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ క్వీన్ ఎలిజబెత్-2 మృతికి గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11వ తేదీన రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. కాగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8, 2022న తుదిశ్వాస విడిచినట్లుగా బర్మింగ్హమ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన రాణి ఎలిజబెత్-2 గౌరవార్థం సెప్టెంబర్ 11వ తేదీన భారతదేశం అంతటా ఒక రోజు సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో సెప్టెంబర్ 11వ తేదీన భారతదేశం అంతటా జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగం వరకు అవనతం చేయనున్నారు. అలాగే ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రేపు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆదివారం ఎలాంటి అధికారిక వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించరాదని కూడా వెల్లడించారు. కాగా మరణించిన ప్రముఖులకు గౌరవ సూచకంగా సంతాప దినం పాటించడం ఒక ఆనవాయితీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ