స్విట్జర్లాండ్లోని దావోస్లో మే 22 నుంచి మే 26 వరకు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అధికారుల బృందం పాల్గొంది. దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్ పలు అంతర్జాతీయ, దేశీయ పలు సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు హ్యుందాయ్ సంస్థ తెలంగాణలో రూ.1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ మొబిలిటీ రంగానికి గొప్ప ప్రోత్సాహంగా, భారీ పెట్టుబడి దిశగా హ్యుందాయ్ సంస్థ ప్రకటన వెలువడింది.
హ్యుందాయ్ గ్లోబల్ తెలంగాణలో వారి ప్రూవింగ్ గ్రౌండ్లను ఏర్పాటు చేయడంలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న మొట్టమొదటి కొత్త మొబిలిటీ వ్యాలీలో వాటాదారు అండ్ కన్సార్టియం భాగస్వామిగా ఉండనుందని తెలిపారు. దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ తో హ్యుందాయ్ సంస్థ సిఐఓ యంగ్చోచి సమావేశం అనంతరం ఈ పెట్టుబడిపై ప్రకటన చేశారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమరనాథ్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని, రాష్ట్రంలో హ్యుందాయ్ సంస్థకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF