దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతుంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు 8 వేలుకు పైగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం 44,513 (0.10%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 8,582 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,32,22,017 కు చేరుకుంది. అలాగే కరోనాతో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,761 కు పెరిగింది. మరో 4,435 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,26,52,743 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.68 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 12, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 85,48,59,461
- జూన్ 11న నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,16,179
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,32,22,017
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 11–జూన్ 12 (8AM-8AM)] : 8,582
- నమోదైన మరణాలు : 4
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,26,52,743
- యాక్టీవ్ కేసులు : 44,513
- మొత్తం మరణాల సంఖ్య : 5,24,761
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY