తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 4446 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒకరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటికి ఇదే అత్యధికం. దీంతో ఏప్రిల్ 16, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 1414 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,11,008 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 89.8 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో పన్నెండు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1809 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.52 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 యాక్టీవ్ కేసులు ఉండగా, ఇందులో 22,118 మంది హోం/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 598, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 435, రంగారెడ్డిలో 326, నిజామాబాదులో 314, సంగారెడ్డిలో 235, కామారెడ్డిలో 184, జగిత్యాలలో 180, నల్గొండలో 168, నిర్మల్ లో 160, కరీంనగర్ లో 149, ఖమ్మంలో 148, మహబూబ్ నగర్ లో 139, వరంగల్ అర్బన్ లో 136 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ