రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరఫున ఒడిశా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటిస్తూ కేంద్రంలోని అధికార బీజేపీ నిర్ణయం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఆమె రేపు (జూన్, 24 శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ద్రౌపది ముర్ము జీ రాష్ట్రపతి నామినేషన్ను భారతదేశంలోని అన్ని వర్గాల వారు ప్రశంసించారు. అట్టడుగు సమస్యలపై ఆమెకున్న అవగాహన మరియు భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ఆమె దృక్పథం అత్యద్భుతం” అని పేర్కొన్నారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో కూడా ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఆమె నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు పలు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF