భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ 10, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6412 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 503 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 199 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,709 మంది ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గత 12 గంటల్లోనే 750 పైగా కొత్త కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1364 కేసులు నమోదవ్వగా, పంజాబ్ రాష్ట్రంలో తక్కువుగా 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల సంఖ్య:
- ఆంధ్రప్రదేశ్ – 365
- అండమాన్ మరియు నికోబార్ దీవులు – 11
- అరుణాచల్ ప్రదేశ్ – 1
- అస్సాం – 29
- బీహార్ – 39
- చండీఘర్ – 18
- ఛత్తీస్ ఘడ్ – 10
- ఢిల్లీ – 720
- గోవా – 7
- గుజరాత్ – 241
- హర్యానా – 169
- హిమాచల్ ప్రదేశ్ – 18
- జమ్మూ కాశ్మీర్ – 158
- జార్ఖండ్ – 13
- కర్ణాటక -181
- కేరళ – 357
- లడఖ్ – 15
- మధ్యప్రదేశ్ – 259
- మహారాష్ట్ర – 1364
- మణిపూర్ – 2
- మిజోరం – 1
- ఒడిశా – 44
- పుదుచ్చేరి – 5
- పంజాబ్ – 101
- పశ్చిమ బెంగాల్ – 116
- రాజస్థాన్ – 463
- తమిళనాడు – 834
- తెలంగాణ – 471
- త్రిపుర – 1
- ఉత్తరాఖండ్ – 35
- ఉత్తర ప్రదేశ్ – 410