ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై 1వ తేదీ నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం వేతనాలు అందుతాయని ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రెండేళ్ల క్రితం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ప్రభుత్వ వేతన స్కేల్ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తోంది. కానీ తాజా మార్గదర్శకాలతో ఇక ప్రభుత్వ ఖజానా నుంచి వీరికి జీతాలు అందనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ సర్టిఫికేషన్ను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజా పీఆర్సీ ప్రకారం ఏడాదిపాటు ఫిట్ మెంట్ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY