అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్ తో విండీస్ పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఆఖరి వన్డే జరగనుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 237/9 పరుగులు చేసింది. యువ ఆటగాడు సూర్యకుమార్ (83 బంతుల్లో 5×4; 64) హాఫ్ సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 4×4; 2×6; 49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కరేబియన్ బౌలర్లలో జోసెఫ్, స్మిత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 46 ఓవర్లలో 193 రన్స్కు ఆలౌటైంది. ఆ జట్టులో బ్రూక్స్ (44), హుసేన్ (34) మాత్రమే రాణించారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఝలక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలిసారి ఓపెనర్ గా వచ్చిన కీపర్ రిషభ్ పంత్ (18) కూడా నిరాశపరిచాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (18) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు రాహుల్, సూర్యకుమార్ సమయోచితంగా ఆది జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించటంలో సాయపడ్డారు. చివర్లో.. వాషింగ్టన్ సుందర్ (24), దీపక్ హుడా (29) ఓమేరకు రాణించారు. ఇక బౌలింగ్ లో టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (9-3-12-4) సంచలన బౌలింగ్తో వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. శార్దూల్ రెండు వికెట్లు, సిరాజ్, హుడా, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ