గడచిన వారం, పది రోజులుగా రోజుకో సంఘటనతో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయం బుధవారం కీలక మలుపు తిరిగింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రేపు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్ని రికార్డ్ చేయాలని గవర్నర్ కోష్యారీ ఆదేశాలు ఇచ్చారు. ఇక గవర్నర్ తాజా నిర్ణయంతో గురువారం సాయంత్రం 5 గం. లోపు సీఎం ఉద్దవ్ ఠాక్రే తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే పార్టీ ఎమ్మెల్యేలలో దాదాపు 3 వంతుల మంది.. రాష్ట్ర మంత్రి, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వద్ద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం షిండే వర్గం గువాహటి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్దవ్ సర్కార్ బలనిరూపణ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని షిండే పేర్కొన్నారు. దీంతో, రేపు ఉద్దవ్ ఈ బల పరీక్షలో గట్టెక్కుతాడా? లేక షిండే ప్రయత్నాలు ఫలిస్తాయా? అని రాజకీయవర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బలనిరూపణ నేపథ్యంలో.. మహారాష్ట్ర అసెంబ్లీలోని అధికార, ప్రతిపక్షాల బలాబలాల సంఖ్య ఇది..
- మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యులు – 288
- అయితే శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించారు, దీంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య – 287
- ఇక ఉద్దవ్ ప్రభుత్వం నిలబడాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య – 144
- శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి బలం: 168
- ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత కూటమి బలం: 119
- ఏక్నాథ్ షిండేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య – 49
- ప్రతిపక్ష బీజేపీ కూటమి ప్రస్తుత బలం – 113
- ఒకవేళ షిండే వర్గం మద్దతు తెలిపితే బీజేపీ బలం – 162
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ