కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు కేవలం నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాలోనే వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఈ పరీక్షల నిర్వహణ తేదీలను కేంద్ర హెఛ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. జూలై 1 వ నుంచి 15 తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో పదో తరగతికి సంబంధించిన 6 సబ్జెక్టుల పరీక్షలు, 12 వ తరగతికి చెందిన 11 సబ్జెక్టుల పరీక్షలు, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో 12 వ తరగతికి చెందిన 12 సబ్జెక్టుల పరీక్షలతో కలిపి మొత్తం 29 పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://www.cbse.nic.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu