ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన రెండో మ్యాచ్ నేడు జరుగనుంది. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అతడిని అదే స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం మెండుగా ఉంది. ఇక ఇంగ్లండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ విజయం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో వరుసగా 13 టీ20 మ్యాచ్లను గెలిచిన మొదటి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. సౌతాంప్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో టీమిండియా 50 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. మరోవైపు పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్లో అనూహ్యంగా ఓటమి పాలవడం ఆ జట్టుని షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీగా సాగనుంది. భారత కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి 7:30కి మ్యాచ్ జరుగనుండగా, మరికొన్ని గంటల్లో ఫలితం తేలనుంది.
తుది జట్ల అంచనా!
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ