రాష్ట్రంలో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం విషయం తెలిసిందే. అలాగే రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లుతో జూలై 11వ తేదీన ప్రగతి భవన్ లో అవగాహన సదస్సు కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూలై 11న ప్రగతి భవన్ లో నిర్వహించ తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన ‘రెవెన్యూ సదస్సులను’ కూడా మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్నతర్వాత ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY