తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్తో పాటు హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఇటీవల వర్షాల వలన జరిగిన విధ్వంసాన్ని వివరించినట్టు బండి సంజయ్ తెలిపారు.
“పొలాలు, ఇళ్లు, ప్రజలు మరియు ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్నందుకు మరియు ప్రకృతి విధ్వంసం గురించి ఆందోళనను వ్యక్తం చేసినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు. మా ఆందోళనలను అర్థం చేసుకున్నందుకు మరియు వెంటనే స్పందించినందుకు అపారమైన కృతజ్ఞతలు” అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే రాష్ట్రానికి హైపవర్ కమిటీ రానున్నట్టు తెలుస్తుంది. అలాగే హైపవర్ కమిటీ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY