ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంగళవారం లోక్సభలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇది ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదని ప్రకటించారు.
ఇక రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, అలాగే కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచిందని నిత్యానంద రాయ్ గుర్తుచేశారు. దీనిని 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని చాలా వరకు హామీలను కేంద్రం నెరవేర్చిందని, కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఇప్పటికే 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ