మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 3, బుధవారం నాడు 1,932 కరోనా కేసులు, 7 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,52,103 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,117 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,187 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 78,91,665 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.01 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.83 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 12,321 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 8,32,80,882 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY