తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 992 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 3, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,22,663 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,132 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 852 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,12,420 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 41,182 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (992):
- హైదరాబాద్ – 376
- రంగారెడ్డి – 65
- కరీంనగర్ – 57
- మేడ్చల్ మల్కాజిగిరి – 54
- నిజామాబాద్ – 37
- నల్గొండ – 37
- యాదాద్రి భువనగిరి – 32
- ఖమ్మం – 32
- హనుమకొండ – 28
- పెద్దపల్లి – 26
- మంచిర్యాల – 21
- మహబూబ్ నగర్ – 20
- రాజన్న సిరిసిల్ల – 20
- సంగారెడ్డి – 19
- మహబూబాబాద్ – 19
- సిద్దిపేట – 18
- ఆదిలాబాద్ – 14
- జనగామ – 13
- నారాయణ్ పేట్ – 12
- వికారాబాద్ – 11
- జగిత్యాల – 11
- వరంగల్ రూరల్ – 10
- మెదక్ – 10
- సూర్యాపేట – 9
- కామారెడ్డి – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 8
- వనపర్తి – 7
- కొమరం భీం ఆసిఫాబాద్ – 7
- ములుగు – 5
- నాగర్ కర్నూల్ – 3
- జయశంకర్ భూపాలపల్లి – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY