దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13193 కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,63,394 కు, మరణాల సంఖ్య 1,56,111 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్ మరియు ఆసుపత్రుల్లో 1,39,542 (1.27%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 10,896 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,06,67,741 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.30 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ఇక ఫిబ్రవరి 18, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా 20,94,74,862 కరోనా పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు 7,71,071 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.6 శాతం 6 రాష్ట్రాలలోనే:
ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 86.6 శాతం మహారాష్ట్ర(5427), కేరళ (4584), తమిళనాడు (457), కర్ణాటక (406), ఛత్తీస్ గడ్ (276), పంజాబ్ (275) వంటి 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. అలాగే గత 24 గంటల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, జార్ఖండ్, మేఘాలయ, పుదుచ్చేరి, చండీ గర్, మణిపూర్, మిజోరం, లక్షద్వీప్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ