దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,98,696 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (1846), కర్ణాటక (1191), కేరళ (1118), ఢిల్లీ (620), హర్యానా (544), తమిళనాడు (539), రాజస్థాన్ (495), ఉత్తరప్రదేశ్ (338), తెలంగాణ (290), గుజరాత్ (290), ఒడిశా (262), వెస్ట్ బెంగాల్ (232) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 41 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,597 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 87 వేలుకుపైగా (87,311 (0.20%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
కొత్తగా 12,875 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,37,83,788 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.62 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆగస్టు 27, శనివారం ఉదయం 7 గంటల వరకు 211.39 కోట్లకుపైగా (2,11,39,81,444) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 25,86,805 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY