ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా తొలిరోజు శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు అంశంపై ప్రభుత్వం చర్చించనుంది. సీఎం జగన్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక శాసనమండలి కూడా ఈరోజే ప్రారంభమైంది. మండలిలో ముందుగా ఏపీలో పారిశ్రామిక ప్రగతిపై చర్చ నిర్వహించనున్నారు.
అయితే మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు శాసనసభ ప్రారంభమైన తర్వాత జాబ్ క్యాలెండర్ అంశంపై చర్చించాలని కోరారు. ఈ క్రమంలో దీనిపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో సభలో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు, వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన తెలుపుతున్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సభ జరుగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY